ఈనెల 7న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి రానున్న సందర్భంగా హెలిప్యాడ్, సభా స్థలం, పార్కింగ్, తదితర ఏర్పాట్లను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు.రోడ్ల నిర్మాణానికి , వాంకిడి సబ్ స్టేషన్కు , పిప్పిరి గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.ఆనంతరం ఎస్సీ కార్పోరేషన్, ట్రైకార్, ఐటీడీఏల ద్వారా మంజూరైన బ్యాంకు లీంకేజీ చెక్కులను పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు.