వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేశుని విగ్రహాలు,పత్రి, పూజా సామాగ్రి తదితరాలు కొనే వారితో చీరాల పట్టణ వీధులు మంగళవారం సాయంత్రం కిక్కిరిసిపోయాయి.కూరగాయల మార్కెట్ సెంటర్ లో ఇవన్నీ ఒకే చోట దొరుకుతుండడంతో ప్రజలు పోటెత్తారు. దీంతో ఆ మార్గంలో ఇసుక వేస్తే కిందకు రాలనంత రద్దీ కనిపించింది.పోలీసులు ఆ మార్గంలోకి వాహనాలను అనుమతించకుండా ట్రాఫిక్ ను నియంత్రించారు. వన్టౌన్ సీఐ సుబ్బారావు అక్కడ పరిస్థితులను సమీక్షించారు.