Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: నూతన గ్రంథాలయాల భవనాల నిర్మాణానికి సహకరించాలని జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన గ్రంథాలయ చైర్మన్ పశువులేటి వీరబాబు

Kothagudem, Bhadrari Kothagudem | Aug 23, 2025
జిల్లాలోని చండ్రుగొండ దమ్మపేట మండల కేంద్రాల్లో నూతన గ్రంథాలయ భవనాల నిర్మాణం కొరకు సహకరించాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత రోజుల్లో గ్రంథాలయాలకు మరింత ఆదరణ పెరిగిందని, పోటీ పరీక్షలకు సిద్ధపడే యువత పెద్ద ఎత్తున గ్రంథాలయాల పై ఆధారపడి చదువుకుంటున్నారని చెప్పారు. వారికి సరైన వసతులు కల్పిస్తే మరింతగా అభివృద్ధి పథంలో సాగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us