జిల్లాలోని చండ్రుగొండ దమ్మపేట మండల కేంద్రాల్లో నూతన గ్రంథాలయ భవనాల నిర్మాణం కొరకు సహకరించాలని కోరుతూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత రోజుల్లో గ్రంథాలయాలకు మరింత ఆదరణ పెరిగిందని, పోటీ పరీక్షలకు సిద్ధపడే యువత పెద్ద ఎత్తున గ్రంథాలయాల పై ఆధారపడి చదువుకుంటున్నారని చెప్పారు. వారికి సరైన వసతులు కల్పిస్తే మరింతగా అభివృద్ధి పథంలో సాగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.