చీమకుర్తి: ఆర్టీసీ బస్సును గ్రానైట్ టిప్పర్ లారీ ఢీకొన్న సంఘటన చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని నుండి ఒంగోలుకు వస్తున్న ఆర్టీసీ బస్సును రామతీర్థం సమీపంలో గ్రానైట్ టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ ముందు భాగం కొంతమేర దెబ్బతింది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.