ఎల్లారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత వైకల్య నిర్ధారణ శిబిరం నిర్వహించారు. కలెక్టర్, విద్యాశాఖ సౌజన్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు మండల విద్యాధికారి ఎల్.రాజులు తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులకు ఉచిత ఉపకరణాలను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.