ఒంగోలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది.ఒంగోలు,సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్,బి.ఎన్ విజయ్ కుమార్ లు ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఒంగోలు నగర సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని,తాము ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించుకొస్తామని ఎమ్మెల్యేలు చెప్పారు. అజెండాలోని అనేక అంశాలపై జరిగిన చర్చలో కూడా వారు పాల్గొని పలు సూచనలు చేశారు.