Download Now Banner

This browser does not support the video element.

గిరిజనుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ కట్ చేయడం పై రావికమతంలో విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజనుల ఆందోళన

Chodavaram, Anakapalli | Aug 30, 2025
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల రావికమతం మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజనులు విద్యుత్ అధికారుల తీరును నిరసిస్తూ శనివారం ఏఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. డోలవానిపాలెం, పాత కొట్నాబెల్లి గ్రామాలకు చెందిన 20 ఆదివాసీ కుటుంబాల ఇళ్లకు విద్యుత్ అధికారులు మీటర్లు, వైర్లు కట్ చేశారని బాధితులు తెలిపారు. రాత్రి వేళలో చంటి పిల్లలతో, జ్వరంతో బాధపడుతున్న తమకు దయ లేకుండా కరెంటు కనెక్షన్ కట్ చేయడం అన్యాయమని వారు ఆరోపించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us