కొయ్యూరు మండలంలో ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబర్ నెల 30వ తేదీ వరకు పశువులకు ముందస్తుగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేస్తున్నామని మండల పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని 25,500 పశువులు, 1,780 గేదెలకు గాలికుంటు, డెక్క జడుపు వ్యాధి నిరోధక టీకాలను వేస్తామని చెప్పారు. ఈమేరకు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.