Download Now Banner

This browser does not support the video element.

నారాయణపూర్: రాచకొండ గుట్టల్లో బోగత జలపాతాన్ని తలపించే జలపాతాలు, ఆకర్షితులవుతున్న పర్యాటకులు

Narayanapur, Yadadri | Aug 25, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండలం లోని రాచకొండ గుట్టల్లో అదిలాబాద్ బోగత జలపాతాన్ని తలపించే జలపాతాలు ఉండడంతో పర్యాటకులు ఆకర్షితులై సందడి చేస్తున్నారు. హైదరాబాదుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని చూడడానికి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాల నుండి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం నారాయణపురం ఎస్ఐ జగన్ మాట్లాడుతూ.. జలపాతాలు ప్రమాదకరంగా ఉన్నాయని, కొందరు గతంలో నాచు జారీ కిందపడి ప్రాణాలు కోల్పోయారని, అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us