మసీదులలో పనిచేసే మౌజనులు,ఇమామ్ లకు11 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని చీరాలకు చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కబీర్ చెప్పారు.జిల్లా వైసీపీ మైనార్టీ నాయకులతో కలిసి ఆయన సోమవారం ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.ఐదు పూటలా మసీదులలో నమాజ్ చేయించే వారికి మరో పని చేసుకునే అవకాశం ఉండదన్నారు.జీతాలు కూడా రాకపోవడంతో వారు కుటుంబాలను పోషించుకోలేకున్నారని కబీర్ కలెక్టర్ కు వివరించారు.