తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోవడం లేదని.. గాడి తప్పిన వ్యవస్థలను సక్రమ మార్గంలో పెడుతోందని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 1గంట సమయంలో మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.