Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: తురకపాలెంలో అనారోగ్యంతో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారంచెల్లించాలి :వైసిపి గుంటూరుజిల్లా అధ్యక్షుడు రాంబాబు

Guntur, Guntur | Sep 4, 2025
గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని తెలుసుకున్న వైసీపీ నాయకులు గురువారం గ్రామంలో పర్యటించారు. ఈ గ్రామంలో 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్నవారు చనిపోతున్నారని, మంచినీటి సరఫరా సరిగ్గా లేకపోవడం, చెరువు నీటిని వాడటం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని నాయకులు ఆరోపించారు. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాంబాబు పేర్కొన్నారు. మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us