Download Now Banner

This browser does not support the video element.

వరదలు తగ్గేవరకూ ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు కొండవాగు దాటవద్దు..కొయ్యూరులో సీఐ బీ.శ్రీనివాసరావు

Paderu, Alluri Sitharama Raju | Sep 9, 2025
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొయ్యూరు మండలంలోని రత్నంపేట, పాడి గ్రామాల మధ్యలో ఉన్న కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోందని సీఐ బీ.శ్రీనివాసరావు మంగళవారం సాయంత్రం తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తోన్న సమయంలో ఎవరూ సాహసించి వాగును దాటవద్దని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో వాగు దగ్గర పోలీసు సిబ్బందిని నియమించామని తెలిపారు. ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us