కొరిశపాడు రిజర్వాయర్ కు సంబంధించి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుతో పాటు రిజర్వాయర్ వద్ద పెండింగ్లో ఉన్న పనులను కూడా రెండు నెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ఆదివారం ఆయన ఈ రిజర్వాయర్ ను పరిశీలించారు. ప్రాజెక్ట్స్ ఎస్.ఈ. అబూత్ అలీం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతి ఈ సందర్భంగా రిజర్వాయరుకు సంబంధించిన వివరాలను కలెక్టరుకు వివరించారు. స్థానికులతోనూ ఆయన చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గుండ్లకమ్మ నది నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా ఈ రిజర్వాయరుకు తరలించేందుకు అడ్డంకిగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు