గుమ్మగట్ట మండలంలోని పులకుంట గ్రామం వద్ద అయ్యప్పనగన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రధానోపాధ్యాయులు బషీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. గత కొంత కాలంగా హెచ్ఎం పనితీరుపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో తల్లిదండ్రులు హెచ్ ఎం ను పలు విషయాలపై నిలదీశారు. అయినప్పటి మార్పు రాకపోగా వారినే దుర్బాషలాడాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.