ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఒంగోలు ఎమ్మెల్యే రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ నేతృత్వంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఒంగోలు ఒంగోలు రూరల్ మరియు కొత్తపట్నం మండలాలకు సంబంధించిన ప్రజలు భారీగా హాజరై వారి సమస్యలను అర్జునుల రూపంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రజలు వెల్లడించిన ప్రతీ సమస్యను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో వెంటనే చర్చించి న్యాయం చేయాలన్నారు