రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వేపరాళ్ల గ్రామానికి చెందిన నవీన్ కుమార్ సోమవారం రాత్రి రాయదుర్గం వైపు బైక్ పై వస్తుండగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. బైక్ నుంచి కింద పడిన నవీన్ కాలు విరిగింది. 108 లో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.