రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో ఆదివారం విలేకరులతో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో అరటి, పత్తి, మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు.