నంద్యాల జిల్లా నంది పల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది, గ్రామానికి చెందిన శేఖర్ తన పశువుల కోసం నిల్వ ఉంచుకున్న పశుగ్రాసం దగ్ధం కావడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు, సుమారు 150 కట్టలకు పైగా పశుగ్రాసం కాలిపోవడంతో 20 వేలకు పైగా ఆస్తి నష్టం వాటినట్లు బాధితుడు వాపోయాడు, దోమల కోసం పెట్టిన పొగ వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది