కలికిరి మండల సర్వసభ్య సమావేశంలో సమస్యలు వెలువత్తాయి. కలికిరి మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం ఎంపీపీ వేంపల్లి నూర్జహాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అధికారులు మండలంలో జరుగుతున్న అభివృద్ధిపై వివరిస్తూ వచ్చారు.ఆర్ అండ్ బి అధికారుల వంతు రాగానే ప్రజా ప్రతినిధులు అధికారులు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. కలికిరి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడ చూసినా రోడ్లు గుంతలుగా మారిన ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.కలికిరి పట్టణం క్రాస్ రోడ్ కలకడ రోడ్ లో కుంట నుండి నీరు రోడ్డుపై గుండా వెళ్తుండడంతో రోడ్డు అంతా పాచిపట్టి ప్రజలు క్రింద పడుతున్నారన్నారు