మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిర్ములనే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది అని ఎస్పీ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వాడకం వలన కలిగే అనర్ధాలు, దుష్పరిణామాలు, ఎదుర్కోవాల్సిన చట్టపరమైన చర్యలు మరియు శిక్షలు పై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వలన ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను గురించి, యువత మత్తుకు బానిసవ్వడం వలన భవిష్యత్తులో ఏవిధంగా వారి జీవితాలు పాడవుతాయో కూడా వివరించటం జరిగింది. గంజాయి మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణా సమాజానికి పెద్ద ప్రమాదమని తెలిపారు.