గుమ్మగట్ట మండలం అయ్యప్పనగన్ హెచ్ఎం బషీర్ పై డిప్యూటీ డిఈఓ మల్లారెడ్డి, ఎంఈఓ సోమశేఖర్, ఎస్ఐ ఈశ్వరయ్య విచారణ చేపట్టారు. సోమవారం విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డెక్కి ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థులు, ఎండిఎం ఏజెన్సీ వారితో వేరువేరుగా విచారణ జరిపారు. రాతపూర్వకంగా పిర్యాదులు స్వీకరించారు. నివేదిక తయారు చేసి కలెక్టర్ కు పంపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.