ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆటోలకు పోలీస్ డిజిటలైజేషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ డిజిటల్ నెంబర్లు స్టిక్కర్లను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మంగళవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఆటో ప్రయాణికులకు, తాము ప్రయాణిస్తున్న ఆటోలకి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచడంతో పాటు, వారు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరడానికి భరోసా కల్పించడమే ఈ డిజిటల్ నెంబర్లు కేటాయింపు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పట్టణంలో నడిచే ఆటోలకు ప్రత్యేకంగా డిజిటలైజేషన్లో నంబర్ కలిగిన స్టిక్కర్లు అమర్చారు