అంతర్జాతీయ 117 వ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు నగరంలో కలెక్టరేట్ సెంటర్ నుండి భారీ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో మహిళలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ మహిళలకు ప్రధానంగా రెండు అంశాలలో అన్యాయం జరిగిందన్నారు మహిళలకు ఉపాధిగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నీరుగార్చిందన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం షాపులను పెట్టి పేద ప్రజలను దోచుకుంటూ ఆదాయంగా చూపిస్తుంది అన్నారు