జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు శుక్రవారం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రిలోని సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణను ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలోనే మందులు ఇస్తున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని రోగులు ఆయనకు చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు డిఆర్ఓ సూచించారు. ఈ సందర్భంగా ఆయన వెంట డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, సి.ఎస్. ఆర్.ఎమ్.ఓ. మాధవీ లత, ఇతర వైద్యులు ఉన్నారు.