యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు సహకార సంఘాల వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులను ఆమె పరామర్శించారు. పోలీసులు ఆధార్ కార్డు, పాస్ బుక్ ఆధారంగా టోకెన్లు ఇచ్చి యూరియా సరఫరా చేయడం ఏంటన్నారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని సబిత డిమాండ్ చేశారు.