Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జాతీయా లోక్ అదాలత్ లో 4576 కేసులు పరిష్కారం: జిల్లా న్యాయమూర్తి

Kothagudem, Bhadrari Kothagudem | Sep 13, 2025
జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు.ఈ లోక్ అదాలత్‌కు కక్షిదారుల నుండి అనూహ్య స్పందన లభించింది.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 11 బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి జాతీయ లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. జిల్లాలో కొత్తగూడెం ఇల్లెందు భద్రాచలం మణుగూరు కోర్టులలో 4576 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు.రాజీమార్గంలో కేసుల పరిష్కారంకోసం కక్షిదారులు పెద్దఎత్తున ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇందుకు న్యాయవాదులు,కోర్టు సిబ్బంది,పోలీసు యంత్రాంగం చేసిన కృషిని కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us