నిజామాబాద్ జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి యోగాసనా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి బాల శేఖర్ తెలిపారు. ఈ పోటీలు దుబ్బలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. యోగ సాధకులు సకాలానికి హాజరై సహకరించాలని కోరారు