హైదరాబాద్లో లంగర్హౌస్ దర్గా సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దర్గా సమీపంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసు వాహనాన్ని వేగంగా వచ్చిన కియా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 20ఏళ్ల యువతి కశ్వి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారులో మద్యం సీసాలు గుర్తించినట్లు తెలిసింది. ముగ్గురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు