చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని జేఎండి కళ్యాణ మండపంలో. వినాయక మండపాల నిర్వహణకులు. వివిధ ప్రభుత్వ శాఖ అధికారులతో సీఐ. సుబ్బారాయుడు, సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాంతంలో మాట్లాడుతూ. వినాయక మండపాలు ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్నారు. వినాయక ఉత్సవాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో ముందుగానే తెలియజేయాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై. హరి ప్రసాద్. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు, అధికారులు. వినాయక మండపాల నిర్వహకులు పాల్గొన్నారు.