కరీంనగర్ నగరంలోని చైతన్యపురి, రాంనగర్, గోదాము గడ్డ, మార్వాడి మందిర్, టవర్ సర్కిల్, గాంధీ రోడ్డు, నాఖా చౌరస్తా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడిన కమీషనర్, నిమజ్జనం కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. మండపాల వద్ద శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.