అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ వద్ద గురువారం ఉదయం 10:00 లకు చోటుచేసుకుంది..స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆనేపురం గ్రామపంచాయతీ పరిధిలోని మెగ్యా తండాకు చెందిన భూక్య వెంకన్న (35) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడగా భార్య పుట్టింటికి వెళ్లింది. వెంచర్లో ఆటోలో మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.