గుంటూరు జిల్లా పొన్నూరులోని ఓం కాలనీ సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి 14 మందిని గురువారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు షేక్ ఫజల్ ఒడిశా నుంచి గంజాయి తెప్పించి అమ్మినట్లు విచారణలో తేలిందని తెనాలి డిఎస్పి శ్రీనివాసరావు పేర్కొన్నారు.. మొత్తం 1.5 కిలోల గంజాయి, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫజల్ తల్లి ఆషా, మనోజ్ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునే చర్యలు కొనసాగుతున్నాయని తెనాలి డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు.