సంగారెడ్డి పట్టణంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శుక్రవారం తో ముగిశాయి. ఈ సందర్భంగా డిఇఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలో విద్యాబోధన ఎలా చేయాలో రిసోర్స్ పర్సన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. చివరి రోజు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.