ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు ప్రాంతమైన గండహతి జలపాతం ఒడిషాలోని గజపతి జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఉంది. పలాస నుండి 26 కి.మీ దూరంలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇటీవల అల్పపీడన కారణంగా కురిసిన వర్షాలకు భారీగా నీరు చేరడంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. దీంతో ఆంధ్ర ఒడిషా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు అక్కడకు చేరుకొని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు