కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని ముద్దనూరు మండలంలోని రైతులకు గురువారం వ్యవసాయ అధికారి వెంకటకృష్ణారెడ్డి పలు విషయాలు ప్రకటన ద్వారా తెలిపారు.మండలంలోని ఆయా రైతు సేవా కేంద్రాల్లో కాంప్లెక్స్ ఎరువులు 20.20.0.13, డిఏపి, 28.28.0 ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ 20.20.0.13 ఎరువు 50 కిలోల బస్తా ధర 1400/-, డీఎపి 50 కిలోల బస్తా ధర 1400 /-చొప్పున అలాగే శెట్టివారిపల్లె,యామవరం రైతు సేవా కేంద్రాల్లో యూరియా 19.8 మెట్రిక్ టన్నులు 440 బస్తాలు అందుబాటులో ఉందన్నారు.