Download Now Banner

This browser does not support the video element.

బొమ్మలరామారం: మాజీ సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేశారు: మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి

Bommalaramaram, Yadadri | Jun 1, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండల పరిధిలోని హాజీపూర్ గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి పండుగ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదివారం సాయంత్రం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పాలనలో దేవాలయాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us