మార్గశిర మాసోత్సవాల నిర్వహణకు సన్నద్దం కావాలని, ఇప్పటి నుంచే సంబంధిత అభివృద్ది పనులు మొదలు పెట్టి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కల్పించాలని, నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని హితవు పలికారు. శుక్రవారం ఆకస్మికంగా ఆలయాన్ని తనిఖీ చేసిన ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. ధర్మదర్శనం క్యూలైన్లతో పాటు ఇతర క్యూలైన్లను, భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించారు