అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం ఆర్. నడింపల్లి పంచాయతీ. బల్ల సముద్రం గ్రామ సమీపంలో శ్రీ వాలేశ్వర స్వామి కొండపై గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ఈవో రమణ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మదనపల్లె క్లూస్ టీం ఘటన స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణ తెలియాల్సింది.