సిద్దిపేట పట్టణంలోని 37 వ వార్డు అంబేద్కర్ నగర్ లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, ఇతర అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. నిరుపేదలైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ముఖంలో ఆనందం చూసి సంతోషం వేస్తుందన్నారు. పారదర్శకంగా పేదలలో నిరుపేదల ను ఇందిరమ్మ లబ్ధిదారులుగా ఎంపిక చేసాము.