Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: పూతలపట్టులోని తిరుపతి హైవేపై డివైడర్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి, ముగ్గురికి గాయాలు

Puthalapattu, Chittoor | Aug 28, 2025
పూతలపట్టు మండలం మెట్టూరు సమీపంలోని తిరుమల డైరీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుండి తిరుపతి వైపు వెళ్తున్న కారు అతివేగంగా దూసుకెళ్లి డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఢీకొట్టిన తీవ్రతకు కారు గ్లాస్ బద్దలైపోగా, ఒకరు కిందపడటంతో, మరొకరు స్టీరింగ్‌కు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Read More News
T & CPrivacy PolicyContact Us