బాపట్ల జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ వెరిఫికేషన్లో తొలగించిన దివ్యాంగుల పింఛన్ దారులకు మరో అవకాశం కల్పిస్తామన్నారు. దీనిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.