ప్రతీ ఒక్కరూ నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు, పాడేరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా పాడేరులోని జిల్లా అంధత్వ నివారణ సంస్థ నుండి సర్వజన సాధారణ ఆసుపత్రి వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. నేత్రదానంపై ఉన్న అపోహలు తొలగించుకుని, నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు.