సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ జాబితా సవరణలపై బిఎల్ఓ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తహసిల్దార్ దశరథ్, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు పాల్గొని బి ఎల్ ఓ లకు ఓటరు జాబితా సవరణలు, నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండే విధంగా చూడాలన్నారు.