Download Now Banner

This browser does not support the video element.

బొమ్మలరామారం: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది: MLA బీర్ల ఐలయ్య

Bommalaramaram, Yadadri | Aug 22, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మర్యాల గ్రామంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం ఉదయం విస్తృతంగా పర్యటించి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us