Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: గణపతి నవరాత్రులను సామరస్యంతో జరుపుకోవాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Mancherial, Mancherial | Aug 25, 2025
ఈ నెల 27వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకొని గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సమీకృత కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, పంచాయితీ, పోలీస్, విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. వినాయక మండపాల ఏర్పాటు కొరకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలని, అనుమతి పొందిన గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందించడం జరుగుతుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us