నారాయణపేట జిల్లా ధన్వాడలోని బీసీ కాలనీలో ఏడు సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నట్లు వాయుపుత్ర ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం వినూత్నంగా గణనాథుడిని అలంకరిస్తున్నామని, గత ఏడాది రుద్రాక్ష మాలలతో అలంకరిస్తే, ఈ సంవత్సరం రంగురంగుల గులకరాళ్లతో అలంకరించామని పేర్కొన్నారు. 11 రోజులపాటు పూజలు చేసి, అనంతరం నిమజ్జనం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.