బైరెడ్డిపల్లి: మండలం సామాజిక మాధ్యమాల్లో పలు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అయింది. గడ్డిండ్లు గ్రామానికి చెందిన బుజ్జన్న కుమారుడు మాజీ వాలంటీర్ చంద్రశేఖర్ (25) గత ఆదివారం చనిపోయిన విషయం తెలిసిందే. వినాయక నిమజ్జనం కోసం అతను వెళ్లాడు. ఆ ప్రక్రియ పూర్తి కావడంతో కాళ్లు చేతులు, కడుక్కోవడానికి హంద్రీనీవా కాలువలో దిగి ప్రవాహంలో చిక్కుక్కున్నాడు. వెంటనే అతడిని బయటకు తీసినప్పటికీ బతకలేదు. ఈ ఘటనకు సంబంధిత వీడియో వైరలవుతోంది. అధికారులు హంద్రీనీవా కాలువ వెంట హెచ్చరిక బోర్డులు పెట్టాలని కోరుతున్నారు లేదంటే మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయన్నారు.