Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
ఉలవపాడు మండలంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలను ఇంటర్నల్ స్క్వాడ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీ చేసింది. సరైన పత్రాలు లేని సుమారు రెండు లక్షల విలువైన సరుకు అమ్మకాలను నిలిపివేసినట్లు కావలి ఏడీఏ నాగరాజు తెలిపారు. నిర్ణీత ధరలకే ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు.