విద్యారంగ సమస్యల పరిష్కారానికై విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్ పిలుపునిచ్చారు ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం 3:40 పి డి ఎస్ యు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తీవ్రతరం అవుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ విద్యారంగ సంస్థలు పరిష్కారం చేయడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.